Nampally exhibition, : ఇవాల్టితో ముగియనున్న నుమాయిష్

Byline :  Vinitha
Update: 2024-02-18 04:54 GMT

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్‌ ఇవాల్టితో ముగియనుంది. నిన్నటితో నుమాయిష్ విజిటర్స్ సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటింది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో దాదాపు 2400 వరకు స్టాళ్లతో ప్రతి యేట జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తారు. ఈ సారి స్టాల్‌ హోల్డర్స్‌ విజ్ఞప్తి మేరకు నుమాయిష్‌ను మూడు రోజులు పొడిగించారు. ఈ మేరకు ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి డి. శ్రీధర్‌బాబు ప్రకటించారు. దీంతో నుమాయిష్‌ ఇవాల్టితో ముగియనుంది.


Tags:    

Similar News