సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీ చోరీ

Update: 2023-06-17 07:32 GMT

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ చోరీ జరిగింది. ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్ లో ఆగి ఉన్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఎక్కుతున్న మహిళ హ్యాండ్ బ్యాగ్ ను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఆ బ్యాగులో 10 తులాల బంగారం, రూ.10 లక్షలు విలువ చేసే డైమండ్ నక్లెస్ ఉన్నట్లు బాధిత మహిళ తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలో నమోదైన దృష్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. 


Tags:    

Similar News