Medico Rachana : మరో నెల రోజుల్లో పెళ్లి.. ఓఆర్ఆర్‌‌పై మెడికో సూసైడ్

Byline :  Veerendra Prasad
Update: 2024-02-13 05:02 GMT

సంగారెడ్డి (Sangareddy) జిల్లా పటాన్‌ చెరులో విషాదం చోటు చేసుకుంది. మరో నెలరోజుల్లో పెళ్లి ఉందనగా ఓ మెడికో విద్యార్థిని విషపూరిత ఇంజక్షన్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం…బిహెచ్‌ఈఎల్, హెచ్‌ఐజికి చెందిన రచనారెడ్డి(మెడికో) .... బాచుపల్లిలోని మమత మెడికల్ కాలేజీలో ఇంటర్న్ షిప్ చేస్తోంది. సోమవారం ఉదయం హాస్పిటల్​కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి తన కారులో బయలుదేరింది. ముత్తంగి వద్ద ఆమె కారు రింగ్ రోడ్డుపైకి ఎక్కింది. కిష్టారెడ్డిపేట–సుల్తాన్​పూర్ పరిధిలో ఆమె కారు రోడ్డు పక్కన రెయిలింగ్​కు తాకి ఆగిపోయి ఉంది.

అవుట్ రింగ్ రోడ్డులో తన కారులోనే అపస్మారక స్థితిలో ఉన్న డాక్టర్ రచనా రెడ్డిని (25) రోడ్‌పై వెళుతున్న వాహనదారులు గమనించి అమీనాపూర్ పోలీసులకు ఫోన్ సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే, అంబులెన్సులో బాచుపల్లి లో ఉన్న మమతా హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం నాలుగు గంటలకు తుది శ్వాస విడిచారు.

సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం లో నివాసం ఉంటున్న రచనా రెడ్డి, ఖమ్మం పట్టణంలో ఉన్నమమతా మెడికల్ కాలేజీ లో పీజీ కోర్సు చేస్తుంది. పీజీ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని బాచుపల్లి లో ఉన్న మమతా మెడికల్ కాలేజీలో విధులు నిర్వహిస్తోంది. కాగా గతేడాది నవంబర్ లో ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది. అతనితో వచ్చిన మనస్పర్థల కారణంగానే రచనా రెడ్డి ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రిలో ఆమె మృతదేహాన్ని ఉంచారు. 




Tags:    

Similar News