ఢిల్లీ పొల్యూషన్ అంతా హైదరాబాద్ను కమ్మేసింది - హరీశ్ రావు

By :  Kiran
Update: 2023-11-26 10:00 GMT

కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే స్కాంలు తప్పవని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాజేంద్రనగర్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు కావడంతో ఢిల్లీలోని పొల్యూషన్ అంతా హైదరాబాద్ను కమ్మేసిందని అన్నారు. మరో 3 రోజులు ఈ కాలుష్యాన్ని భరించక తప్పదని ఆ తర్వాత మళ్లీ కనిపించరని సటైర్ వేశారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ కరెంట్‌ కోతలు తప్పవని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దావాఖానాకు అనే పాటలు ఉండేవని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. హైదరాబాద్‌ ఎంత అభివృద్ధి చెందిందో అందరినీ తెలుసని చెప్పారు. బీఆర్ఎస్ను మళ్లీ గెలిపిస్తే పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని అందుకే ప్రజలందరూ ఆలోచించి సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని హరీశ్‌రావు సూచించారు.

Tags:    

Similar News