మంత్రి హరీష్ రావు ఖమ్మం పర్యటన.. షెడ్యూల్ ఇదే

Update: 2023-06-29 15:49 GMT

రాష్ట్ర మంత్రి హరీశ్ రావు రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు శుక్రవారం (జూన్ 30) కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పోడు భూముల పట్టా పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

షెడ్యూల్ వివరాలు:

* హరీష్ రావు.. 2023 జూన్ 30న శుక్రవారం ఉదయం 11.30 గంటలకు కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోడు భూముల పట్టా పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

* ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం జిల్లాలో నూతనంగా మంజూరై ఈ ఏడాది ప్రారంభించబోతున్న.. ‘ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల’ను సందర్శిస్తారు.

* వెంటనే అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు ఖమ్మం జిల్లాకు సంబంధించిన పోడు భూముల పట్టా పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.  

Tags:    

Similar News