టీవీల్లో కూర్చొని మాట్లాడటం తప్ప రఘునందన్కు ఏం తెల్వదు -కేటీఆర్

By :  Kiran
Update: 2023-11-21 10:57 GMT

కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. దుబ్బాకలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన.. రాహుల్, రేవంత్ కు ఎద్దు, వ్యవసాయం గురించి తెలియదని విమర్శించారు. కాంగ్రెస్ వ్యక్తే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి చేశాడని, దేవుడి దయతో ఆయన బయటపడ్డాడని అన్నారు. రేవంత్, కోమటిరెడ్డి కరెంటు ఎక్కడుందని మాట్లాడుతున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. రెండు బస్సులు పంపుతాం, అందులో వెళ్లి కరెంట్ వైర్లు పట్టుకొని చూడండి అప్పుడు కరెంటు ఉందో లేదో తెలుస్తుందని సటైర్ వేశారు.

బీజేపీ నాయకులవి అన్నీ అబద్దపు మాటలేనని కేటీఆర్ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో రఘునందన్ అన్నీ దొంగ మాటలే చెప్పాడని, అప్పుడు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్పారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థికి టీవీలో కూర్చొని మాట్లాడటమే తెలుసని విమర్శించారు. ఈ ఎన్నిక దుబ్బాక దశ, దిశ మార్చే ఎన్నికని, బీఆర్ఎస్ కు మళ్లీ అధికారం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Tags:    

Similar News