MP Ramulu : కేసీఆర్కు మరో ఎంపీ షాక్.. ఇవాళ బీజేపీలో చేరిక..!

Byline :  Krishna
Update: 2024-02-29 01:34 GMT

బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ రాములు షాక్ ఇచ్చారు. ఇవాళ బీజేపీలో చేరనున్నారు. నిన్ననే ఆయన తన కొడుకుతో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఇవాళ బీజేపీ పెద్దల సమక్షంలో కమలం కండువా కప్పుకోనున్నారు. గత కొన్నాళ్ల నుంచి రాములు బీఆర్ఎస్తో అంటిముట్టనట్లు ఉంటున్నారు. నాగరకర్నూల్ నుంచి బీజేపీ తరుపున ఆయన కొడుకు భరత్ను ఎన్నికల బరిలోకి దింపేందుకు రాములు ప్రయత్నిస్తున్నారు. అటు బీజేపీ సైతం భరత్కు టికెట్ ఇచ్చేందుకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.




 


రాములు తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించినా.. ఆ పార్టీలో ఎంపీ టికెట్ కోసం పోటీ ఎక్కువ ఉండంతో బీజేపీలో చేరాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కాగా నాగర్ కర్నూల్ టికెట్ను కాంగ్రెస్ నేతలు సంపత్ కుమార్, మల్లు రవి ఆశిస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో బరిలోకి దిగుతానని ఇప్పటికే మల్లు రవి ప్రకటించారు. అటు ఢిల్లీ అధికార ప్రతినిధి పదవికి సైతం ఆయన రాజీనామా చేశారు. అయితే దానిని సీఎం రేవంత్ ఇంకా ఆమోదించలేదు. కానీ నాగర్ కర్నూల్ టికెట్ ఇస్తానని రేవంత్ భరోసా ఇచ్చారని మల్లు చెబుతున్నారు.


Tags:    

Similar News