హైదరాబాద్‌లో ఉత్సాహంగా శారీ రన్‌..పాల్గొన్న బ్రాహ్మణి

Byline :  Vamshi
Update: 2024-03-17 10:52 GMT

హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో బెంగళూరుకు చెందిన ఫిట్ నెస్ కంపెనీ జేజే యాక్టివ్ ఆధ్వర్యంలో ‘శారీ రన్‌ కార్యక్రమం నిర్వహించింది. హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి జెండా ఊపి ఈ రన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణి మాట్లాడుతూ.. సంప్రదాయ చీరకట్టుతో మహిళలకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని అన్నారు. మరోవైపు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు బ్రాహ్మణితో సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.

దాదాపు 3 వేల మందికి పైగా మహిళలు చీరకట్టులో పరుగులు పెట్టారు. చీర సంప్రదాయంతో పాటు స్త్రీలకు గుర్తింపు తీసుకురావడంతో పాటు సాధికారతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. తనైరా సీఈవో అంబుజ్ నారాయణ్ మాట్లాడుతూ.. చీరలు మహిళలకు హుందాతనం, గౌరవాన్ని ఇస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేజే యాక్టివ్ కోచ్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచడం, మహిళా సాధికారత, స్త్రీలలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలని ఆమె అన్నారు.

Tags:    

Similar News