ఎల్బీ స్టేడియంలో బీసీ సభ.. 7న తెలంగాణకు మోడీ..

Update: 2023-11-04 13:23 GMT

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ జోరు పెంచింది. ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ వచ్చేవారం మరోసారి తెలంగాణకు రానున్నారు. నవంబర్ 7న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బీసీ సభలో ఆయన పాల్గొంటారు.

ప్రధాని షెడ్యూల్

ప్రధాని మోడీ నవంబర్ 7 సాయంత్రం 5.05 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎల్బీ స్టేడియానికి వెళ్తారు.

సాయంత్రం 5.30 నుంచి 6.10 గంటల వరకు బీసీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు.

6.35కి బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్తారు.

ఎల్బీ స్టేడియంలో నిర్వహించే సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపు లక్ష మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.



telanagana,ts politics,ts election,assembly election,bjp campaign,pm modi campaign,narendra modi,lb stadium meeting,begumpet airport,bc public meeting,delhi,bjp bc meeting,bjp public meeting,lb stadium bjp meeting

Tags:    

Similar News