బస్సుల్లో ఫ్రీగా వెళ్లాలంటే ఇది తప్పనిసరి: మంత్రి పొన్నం ప్రభాకర్

By :  Bharath
Update: 2023-12-07 16:27 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం, మంత్రుల మధ్య జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల అమలుపై సుధీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. కాగా కేబినెట్ సమావేశం అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఎల్లుండి (డిసెంబర్ 9) నుంచి తెలంగాణ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మహిళ తెలంగాణ పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ఫ్రీగా ప్రయాణించవచ్చని చెప్పారు. అయితే దీనికోసం మహిళలు కండక్టర్ కు తమ ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రయాణ సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే.. సమీక్షించి మార్పులు చేస్తామని తెలిపారు.




Tags:    

Similar News