MODI : మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని

Byline :  Vinitha
Update: 2024-03-05 06:16 GMT

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ముందుగా సికింద్రాబాద్‌లోని మహంకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానికి అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వదించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.




 




Tags:    

Similar News