Kotha Prabhakar Reddy: ఇంటి స్థలం కోసమే ప్రభాకర్ రెడ్డిపై దాడి?

By :  Bharath
Update: 2023-10-31 03:51 GMT

మెదక్ ఎంపీ, దుబ్బాక నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై నిన్న మధ్యాహ్నం హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఘటని రాజు(38) అనే వ్యక్తి.. ప్రభాకర్ రెడ్డిని కత్తితో పొడిచాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభాకర్​రెడ్డి సోమవారం (అక్టోబర్ 30) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ప్రచారం చేశారు. అక్కడ ప్రభాకర్ రెడ్డిని కలవడానికి వచ్చిన రాజు.. సెల్ఫీ తీసుకుంటానని వచ్చి కత్తితో దాడి చేశాడు. కత్తి కడుపులో లోతుగా దిగడంతో.. ఆయనను హుటాహుటిన హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కు తరలించారు. కాగా, దుండగుడు రాజు.. ఎంపీపై దాడి చేయడానికి గల కారణాలు కొన్ని బయటికి వస్తున్నాయి.

ఓ యూట్యూబ్​ చానల్​లో రిపోర్టర్​గా పనిచేస్తున్న రాజు.. జర్నలిస్టుల ఇంటి స్థలం కోసం గత రెండు నెలలుగా ఎంపీ చుట్టూ తిరుగుతున్నాడు. ఎన్నిసార్లు ప్రభాకర్ రెడ్డితో మాట్లాడలని ప్రయత్నించినా.. ఆయన నుంచి స్పందనలేకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తాజాగా మండలానికి చెందిన 13 మంది రిపోర్లకు ఇళ్ల స్థలాలు కేటాయించగా.. రాజుకు మాత్రం స్థలం రాలేదు. ఈ విషయంపై రాజు సంబధిత అధికారులను కలవగా.. వారు ఎంపీని కలవాలని సూచించారు. దీంతో రెండు నెలలుగా ఇంటి స్థలం కోసం రాజు.. ఎంపీ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో నిన్నిటి మీటింగ్ కు ఎంపీని కలవడానికి రాగా.. కొందరు నేతలు రాజును అడ్డుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా కొంతకాలంగా కుటుంబంలో గొడవలు జరిగి భార్యకు దూరంగా ఉంటున్నట్లు ఊరి ప్రజలు తెలిపారు.

Tags:    

Similar News