కొనసాగుతోన్న సింగరేణి ఎన్నికల కౌంటింగ్

Update: 2023-12-27 14:53 GMT

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 11 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అర్ధరాత్రి సమయంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. తొలుత ఇల్లందు, చివరన శ్రీరాంపూర్ ఏరియా ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో నిలవగా.. ప్రధానంగా సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ, కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్​టీయూసీ మధ్యే ప్రధాని పోటీ నెలకొంది. గెలుపుపై రెండు సంఘాలు ధీమాగా ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దయం 7 గంటలకు మొదలైన పోలింగ్ 5గంటల వరకు కొనసాగింది. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో 94 శాతం పోలింగ్ నమోదైంది.

Tags:    

Similar News