స్టేట్ ఎగ్జిక్యూటివ్లను నియామించిన బీజేపీ.. మొత్తం 17 మందిలో..!

Byline :  Bharath
Update: 2024-02-10 16:07 GMT

బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లను నియమించింది. టీబీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్టేట్ ఎగ్జిక్యూటివ్లను నియమించారు. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం (ఫిబ్రవరి 10) వారిని నియమించినట్లు పార్టీ కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా 17 మందిని స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ప్రకటించారు. పార్టీ అధిష్టానం నియమించిన వారిలో.. భానుప్రకాశ్, గీతామూర్తి, కొప్పు భాష, హుస్సేన్ నాయక్, రావుల రాజేందర్, నరేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సదానంద్ రెడ్డి, కంకణాల శ్రీధర్ రెడ్డి, ఆలె భాస్కర్ రాజు, బస్వపురం లక్ష్మీనర్సయ్య, శ్యాంసుందర్ రావు, వీరభద్రచారి, రాజవర్ధన్ రెడ్డి, యుగదీశ్వర్, ఒద్దిరాజు రామచందర్ రావు, భాస్కర్ రెడ్డి ఉన్నారు. 

Tags:    

Similar News