Telangana Assembly: రేపు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు తెలంగాణ బ‌డ్జెట్

By :  Kiran
Update: 2024-02-09 16:13 GMT


ఈ నెల 10 వ తేదీన(శనివారం) మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఈ మేర‌కు స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానానికి శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. అనంత‌రం స‌భ‌ను వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు స‌భ తిరిగి ప్రారంభ‌మ‌వుతుంద‌ని తెలిపారు. రేపు స‌భ‌లో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

ఇక రేపు ఉద‌యం 9 గంట‌ల‌కు రేవంత్ మంత్రివర్గ( తెలంగాణ కేబినెట్) స‌మావేశ‌మై బ‌డ్జెట్‌కు ఆమోదం తెలుప‌నుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ భేటీలో రాష్ట్ర బడ్జెట్ కు కేబినెట్ ఆమోద ముద్రవేయనున్నది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు శాసన సభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తొలి బడ్జెట్ కావడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.


Tags:    

Similar News