తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్ల బదిలీ.. ఉత్తర్వులు జారీ

Byline :  Bharath
Update: 2023-12-31 13:17 GMT

తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. నల్గొండ ఎస్పీగా చందనా దీప్తిని ప్రభుత్వం నియమించింది. అపూర్వ రావును సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నల్గొండ ఎస్పీగా కొనసాగుతున్న అపూర్వరావును బదిలీ చేసి.. ఆమె స్థానంలో వేకెన్సీ రిజర్వ్‌లో ఉన్న చందనా దీప్తిని నియమించింది. చందనా దీప్తి ఇదివరకు నార్త్ జోన్ డీసీపీగా పనిచేశారు. ఇటీవల పలువురు ఐపీఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం.. చందనా దీప్తిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. తాజాగా నల్లగొండ ఎస్పీగా బాధ్యతలు అప్పగించింది.

Tags:    

Similar News