TSPSC.. ఆ ఆరుగురి నియామకాన్ని పరిశీలించండి: హైకోర్టు

Update: 2023-06-16 17:15 GMT

టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆరుగురు టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకాన్ని మళ్లీ పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కారం రవీందర్ రెడ్డి, బండి లింగారెడ్డి, ఆర్.సత్యనారాయణ, సుమిత్ర ఆనంద్ తనోబా, రమావత్ ధన్ సింగ్, ఆరవెల్లి చంద్రశేఖర్ నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. టీఎస్పీఎస్సీ సభ్యులను నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం 2021 మే 19న జీవో 108 జారీ చేసింది.

ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ ఎ. వినాయక్ రెడ్డి.. టీఎస్పీఎస్సీ నిబంధనల మేరకు ఆరుగురు సభ్యుల అర్హతలు, విశిష్టతలు లేవని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ విషయంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆరుగురు సభ్యుల అర్హతలు, విశిష్టతలను పరిశీలించి, మూడు నెలల్లోగా కసరత్తు పూర్తి చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఆరుగురి నియామకాన్ని రద్దు చేయాలన్నది ప్రస్తుత దశలో అవసరం లేదని హైకోర్ట్ వెల్లడించింది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల శక్తి సామర్థ్యాలు ప్రజల్లో విశ్వాసం కలిగించేలా ఉండాలని హైకోర్టు కోరింది.

Tags:    

Similar News