Minister Konda Surekha : రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు డెంగ్యూ పాజిటివ్

Byline :  Veerendra Prasad
Update: 2024-02-19 07:46 GMT

తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాక మంత్రి కొండా సురేఖ అనారోగ్యం బారిన పడ్డారు. సోమవారం ఆమెకు డెంగ్యూ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో జ్వరం బారిన పడిన ఆమె తన కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు . ఐదు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో డాక్టర్లు పలు వైద్య పరీక్షలు చేయడంతో డెంగ్యూ పాజిటివ్ గా నిర్ధారరణ అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో డాక్టర్ల కొండా సురేఖకు చికిత్స అందిస్తున్నారు. రోజువారి కార్యక్రమాలను మంత్రి ఇంటి నుంచి పర్యవేక్షిస్తున్నారు. మేడారం జాతర పనుల పురోగతిని, ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకుంటూ, అవసరమైన సూచనలు చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో కోలుకుని మేడారం సమ్మక్క సారక్క జాతరలో మంత్రి పాల్గొంటారని తెలుస్తోంది.

Tags:    

Similar News