Pravalika Incident: ప్రవళిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. సొంతూరుకు..

By :  Krishna
Update: 2023-10-14 05:39 GMT

హైదరాబాద్ అశోక్ నగర్లో ప్రవళిక ఆత్మహత్య ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పజెప్పారు. స్వగ్రామమైన వరంగల్ జిల్లా బిక్కాజీపల్లిలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఒక్కగానొక కూతురు మృతి చెందడంతో కుటుంభసభ్యులు బోరున విలపిస్తున్నారు. ప్రవళిక సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

‘‘అమ్మా.. నన్ను క్షమించండి. నేను చాలా నష్టజాతకురాలిని. నా వల్ల మీరు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. మీకు పుట్టడం నా అదృష్టం అమ్మా.. నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు.. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా.. నన్ను ఎవరూ క్షమించరు. మీ కోసం నేను ఏం చేయలేకపోతున్నా అమ్మా.. ఏడవకండి అమ్మా.. జాగ్రత్తగా ఉండండి’’ అని ఆ లేఖలో ఉంది.

ప్రవళిక అశోక్ నగర్లోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. శుక్రవారం రాత్రి హాస్టల్ లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే గ్రూప్ 2, డీఎస్సీ ఎగ్జామ్స్ వాయిదా పడడంతో మపస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. పోటీ పరీక్షల అభ్యర్థులు సహా ఓయూ విద్యార్థులు అడ్డుకున్నారు. ఆందోళనకు దిగిన అభ్యర్థులపై పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత లాఠీఛార్జి చేయగా.. అభ్యర్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. చివరకు 1.30కు ప్రవళిక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News