KTR : ప్రతిపక్షంగా ఇదే మా తొలి గెలుపు..కేటీఆర్

Update: 2024-02-12 05:31 GMT

కృష్ణా నది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించట్లేదంటూ కాంగ్రెస్ ప్రవేశపెట్టే తీర్మానం తీర్మానం బీఆర్ఎస్ విజయమన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ మేరకు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీటర్ వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ ‘ఛలో నల్గొండ ఎఫెక్ట్!’ అని చెప్పుకొచ్చారు.




 


కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి నిరసనగా రేపు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ 'ఛలో నల్గొండ' సభ సృష్టించిన ఒత్తిడి కారణంగానే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ తెలిపారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేమంటూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనుందని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ సాధించిన తొలి విజయం ఇదేనని మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.




Tags:    

Similar News