గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల.. వారికి ఎగ్జామ్ ఫీజులో మినహాయింపు

Byline :  Bharath
Update: 2024-02-19 13:49 GMT

టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 563 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫిబ్రవరి 23 నుంచి ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. కాగా గత ప్రభుత్వ హయాంలో రిలీజ్ అయిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ రద్దు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.. గత ప్రభుత్వం 2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. వాటికి అదనంగా 60 పోస్టులను కలిపిన రేవంత్ సర్కార్.. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.

నోటిఫికేషన్ వివరాలు:

• ఆన్ లైన్ అప్లికేషన్ : ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు.

• ఎడిట్ ఆప్షన్ : మార్చి 23 నుంచి 27 మార్చి వరకు.

•హాల్ టికెట్ డౌన్ లోడ్ : ఎగ్జామ్ కు 7 రోజుల ముందు నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

• ప్లిలిమినరీ ఎగ్జామ్ మే లేదా జూన్ నెలలో నిర్వహిస్తారు.

• మెయిన్ ఎగ్జామ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఉంటుంది.

Tags:    

Similar News