వెదర్ అలర్ట్.. రాష్ట్రానికి రెండు రోజులు భారీ వర్షాలు..

By :  Kiran
Update: 2023-12-04 10:36 GMT

రాష్ట్రానికి వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. రానున్న రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. మంగళవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వానలు పడతాయని అధికారులు ప్రకటించారు. ఈ జిల్లాలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అన్నారు. మరోవైపు

భూపాలపల్లి, జయశంకర్‌, ములుగు, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్‌ కర్నూల్‌, వరంగల్‌, హన్మకొండ, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించారు.

Tags:    

Similar News