Madagani sweta : ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ దారుణ హత్య

Byline :  Vamshi
Update: 2024-03-10 11:27 GMT

ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్‌లోని ఏఎస్ రావునగర్‌కు చెందిన మాదగాని శ్వేతను తన భర్త అశోక్ రాజ్ హత్య చేశాడు. ఆమె మృతి దేహాన్ని విక్టోరియాలోని బక్లీలో ఓ చెత్తకుండీలో పడేశాడు. అనంతరం తన కుమారుడిని హైదరాబాద్‌లోని అత్తగారింట్లో వదిలి మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. కేసు విచారణలో అశోక్ రాజే హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ క్రమంలో ఆమె చెత్త డబ్బాలో శవమై కనిపించింది. శ్వేత మృతిపై కేసు నమోదు చేసుకున్న విక్టోరియా పోలీసులు విచారణ చేపట్టారు.




 


అయితే ఈ కేసులో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మెుదట ఎవరో హత్య చేసి ఉంటారని భావించగా.. భర్తే ఆ దారుణానికి ఒడిగిట్టినట్లు తెలిసింది. భార్యను హత్య చేసిన అశోక్ రాజ్ మృతదేహాన్ని చెత్తడబ్బాలో దాచి పెట్టాడు. అనంతరం కుమారుడితో కలిసి హైదరాబాద్ చేరుకున్న అతడు కొడును ఏఎస్ రావు నగర్‌లోని అత్తగారి ఇంట్లో వదిలాడు. అనంతరం ఆస్ట్రేలియాకు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న విక్టోరియా పోలీసులు విచారణ చేపట్టారు. శ్వేత మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు బంధువులు ప్రయత్నాలు మెుదలు పెట్టారు.




Tags:    

Similar News