అసహజ శృంగారం కోసం వేధిస్తున్నారు..తెలంగాణ ఐఏఎస్‌పై భార్య ఫిర్యాదు

Update: 2023-06-11 11:09 GMT

తెలంగాణ ఐఏఎస్‌ సందీప్‌ కుమార్‌ ఝా చిక్కుల్లో పడ్డారు. సందీప్‌కుమార్ అసహజ శృంగారం కోసం వేధించడంతో పాటు అదనపు కట్నం డిమాండ్ చేస్తున్నారని అతడి భార్య కోర్టును ఆశ్రయించింది. దీంతో ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా న్యాయస్థానం ఐఏఎస్‌పై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశించింది.

సందీప్‌ కుమార్‌ స్వస్థలం బిహార్‌లోని దర్భంగా జిల్లా కాగా... ఆయనకు 2021లో కోర్బా ప్రాంతానికి చెందిన యువతితో వివాహమైంది. అయితే అతడి భార్య తీవ్ర ఆరోపణలు చేస్తూ కోర్టుమెట్లెక్కింది. కోటీ రూపాయల ఖర్చు పెట్టి పెళ్లిజరిపించినా..పెద్దఎత్తున బంగారం, ఆభరణాలు తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అంతే కాకుండా గృహహింసతో పాటు అసహజ శృంగారానికి బలవంతం చేశారన్నారు. పెళ్లికి ముందు, తర్వాత కట్నం కోసం ఆయన హింసించినట్లు వివరించారు. కోర్బా ఎస్పీకి ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2014 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి సందీప్‌ కుమార్‌ ఝా.. ఐటీ శాఖలో జాయింట్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు 

Tags:    

Similar News