ప్రపంచం మోదీని బాస్గా గుర్తించి.. పాదాభివందనం చేస్తోంది: బండి సంజయ్

Update: 2023-07-08 07:30 GMT

వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొన్న రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్.. మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనను అంతం చేసి.. కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు మోదీని బాస్ గా గుర్తించి.. ఆయనకు పాదాభివందనం చేస్తున్నాయన్నారు బండి. ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన మహా నేత మోదీ అన్న బండి.. ‘ఏ ముఖం పెట్టుకుని ఆయన వరంగల్ కు వస్తున్నడ’ని అంటున్నవాళ్లకు సమాధానం ఇచ్చారు.

‘రైల్వే వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ను ప్రారంభించి 3వేల నుంచి 10వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు అందించడానికి వచ్చారు. జిల్లాలో రూ.6,100 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభించడానికి వచ్చారు. వరంగల్ ను స్మార్ట్ సిటీగా ప్రకటించేందుకు వచ్చారు. కేఎంసీ హాస్పిటల్ కు అత్యాధునిక వసతులు కల్పించేందుకు వచ్చారు. వరంగల్ కు టెక్స్ టైల్స్ పార్క్ ప్రారంభించేందుకు వచ్చార’ని బండి సంజయ్ సమాధానం ఇచ్చారు.

అయితే, సభకు ఆహ్వానం పంపినా.. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని సభకు రాలేదని ప్రశ్నించారు. తెలంగాణకు న్యాయం జరగలేదని అంటున్న కేసీఆర్.. ఈ సభకు వచ్చి కేంద్రాన్ని నిలదీసి అడగాల్సిందని మండిపడ్డారు. ఆ ధ్యాస లేని సీఎం.. ఆఫీసుల్లో కూర్చొని విమర్శించడం చేతకాని తనం అని బండి ఆరోపించారు. తనను నమ్మి ఇంతకాలం నాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించిన బీజేపీ అధిష్టానానికి శిరస్సు వంచి నమస్కరిచారు బంది. ఒకసారి మోదీ తన పేరు పిలుస్తే చూడాలనుకున్నాని.. పిలవడమే కాదు, నా భుజం తట్టి ముందుకు నడిపించారు పేర్కొన్నారు. ఇది తనకు దక్కిన పునర్జన్మ సుక్రుతంగా, అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. మోదీ నింపిన ధైర్యంతో రాబోయే ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ గడీలను బద్దలు కొట్టి.. కుటుంబ పాలనను అంతం చేస్తామని అన్నారు. 




Tags:    

Similar News