కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు.. కేసీఆర్కు మోదీ సాయం : షర్మిల

By :  Krishna
Update: 2023-11-22 14:39 GMT

ఎన్నికల్లో ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర రాజకీయాలకు ఐటీ దాడులే నిదర్శనమన్నారు. ప్రత్యర్థులను నైతికంగా ఎదుర్కొనే దమ్ములేక అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఐటీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్, మోదీ గల్లీలో కుస్తీ పడుతూ ఢిల్లీలో దోస్తీ నడుపుతున్నారని విమర్శించారు. తెరచాటు రాజకీయాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన కేసీఆర్పై ఎలాంటి విచారణ లేదని షర్మిల అన్నారు. లిక్కర్ స్కాంలో కవిత సహా భూకబ్జాలతో అడ్డగోలు దోపిడీకి పాల్పడిన బీఆర్ఎస్ నాయకులపై ఎలాంటి ఐటీ, ఈడీ సోదాలు జరగడం లేదని మండిపడ్డారు. ప్రజలు అధికారం కట్టబెట్టింది ప్రజాసేవ కోసం కానీ ప్రతిపక్షాలను అణగదొక్కేందుకు కాదని అన్నారు. కేసీఆర్, మోదీ పాలనలకు తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని చెప్పారు.

Tags:    

Similar News