CM KCR Nomination : గ‌జ్వేల్‌లో నామినేష‌న్ దాఖ‌లు చేసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్

Byline :  Veerendra Prasad
Update: 2023-11-09 06:22 GMT

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారంనాడు గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉదయం గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయానికి సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో వచ్చారు. అక్కడి నుండి తన వాహనంలో ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ పత్రాలు సమర్పించిన తర్వాత కేసీఆర్ ఓపెన్ టాప్ జీపులో తిరుగుతూ స్థానిక బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు. మ‌రికాసేప‌ట్లో కామారెడ్డికి కేసీఆర్ బ‌య‌ల్దేర‌నున్నారు. అక్క‌డ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల లోపు కేసీఆర్ నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. అనంత‌రం అక్క‌డ నిర్వ‌హించే బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు.




 


సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో సీఎం కేసీఆర్ శ‌నివారం ప్రత్యేక పూజలు చేసిన సంగ‌తి తెలిసిందే. నామినేషన్‌ వేసే ముందు ప్రతిసారి సీఎం కేసీఆర్‌ కోనాయిపల్లి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఆలయంలో తొలుత ధ్వజస్తంభానికి మొక్కి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు నామినేషన్‌ పత్రాలను స్వామి వారి సన్నిధిలో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


Tags:    

Similar News