RS Praveen Kumar : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు త్రుటిలో తప్పిన ప్రమాదం

Update: 2023-11-14 16:27 GMT

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కాగజ్‌నగర్ పట్టణ పరిధిలోని పెద్దవాగు వద్ద ఆయన వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు లారీ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తాను క్షేమంగా ఉన్నానని.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్ఎస్పీ చెప్పారు.

సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రజలపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆర్ఎస్పీ ఆరోపించారు. కోనప్ప అక్రమాలను ప్రశ్నించేవారిపై పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. నవంబర్ 30న ప్రజలు ఆయనకు ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. తమ పోరాటం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో కాదని.. కోనప్ప దౌర్జన్యాలపై అని అన్నారు. ఈ ఈ ఎన్నికల్లో కేసీఆర్ దోపిడీ పాలనకు చరమగీతం పాడాలని ఆర్ఎస్పీ పిలుపునిచ్చారు.




Tags:    

Similar News