Seethakka : ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం ఏర్పడుతుంది : సీతక్క

Byline :  Krishna
Update: 2023-12-04 05:19 GMT

తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. తన గోస తగలడం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని విమర్శించారు. సీఎల్పీ సమావేశానికి వెళుతూ ఆమె మీడియాతో మాట్లాడారు. తనను ఓడించేందుకు బీఆర్ఎస్ నేతలు ఎన్నో దుర్మార్గాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు తాను చేసిన సేవను కూడా అవమానించారని మండిపడ్డారు. ములుగులో 200 కోట్లు వెదజల్లి తనను ఓడించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. కానీ ములుగు ప్రజలు బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టారని చెప్పారు.

రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం ఏర్పడనుందని సీతక్క చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ములుగు నియోజకవర్గానికి తప్పకుండా తగిన ప్రాధాన్యం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ములుగు ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర, రాహుల్ గాంధీ విజయభేరీ ములుగు నుంచే మొదలయయ్యాయని చెప్పారు.


Tags:    

Similar News