MLA Rajaiah : బీఆర్ఎస్ టికెట్ ఇస్తారేమో.. ఆశలు వదులుకోని రాజయ్య

Byline :  Krishna
Update: 2023-10-10 03:05 GMT

ఎమ్మెల్యే రాజయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘనపూర్ అభ్యర్థి విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం మార్చుకుంటుందన్న నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ప్రజాభిమానం తనకే ఉందని.. ప్రజలు తనను ఎమ్మెల్యేగా కొనసాగాలని కోరుకుంటున్నారని తెలిపారు. సర్వేలు, ఇతర నివేదికల ద్వారా అధిష్ఠానం ఆ విషయం తెలుసుకుని నిర్ణయం మార్చుకుంటుందన్న విశ్వాసం ఉందన్నారు. ఇప్పటికీ కేసీఆర్ సహా పార్టీకి విధేయుడిగా ఉన్నానని అన్నారు.

స్టేషన్ ఘనపూర్ టికెట్ ఈ సారి రాజయ్యకు కాకుండా కడియం శ్రీహరికి ఇచ్చారు సీఎం కేసీఆర్. అప్పటినుంచి రాజయ్య పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. కడియంపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంపై కన్నీరు సైతం పెట్టుకున్నారు. అయితే మంత్రి కేటీఆర్ రాజయ్యకు నచ్చజెప్పగా.. సీఎం కేసీఆర్ ఆయన్ను రైతు బంధు సమితి చైర్మన్గా నియమించారు. చైర్మన్ గా ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టగా.. ఎమ్మెల్యే టికెట్పై మాత్రం ఇంకా ఆశలు వదులుకోలేదు. 


Tags:    

Similar News