రామేశ్వరంలో సముద్ర స్నానం చేసిన ప్రధాని మోడీ

Byline :  Vijay Kumar
Update: 2024-01-20 16:01 GMT

ప్రధాని మోడీ ఈ రోజు తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అంతకు మందు ప్రధాని మోడీ అక్కడి అగ్ని తీర్థంలో సముద్ర స్నానమాచరించారు. అదేవిధంగా ఆలయంలోని తీర్థ బావుల పవిత్ర జలాలను ఒంటిపై పోసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి భజనల్లో పాల్గొన్నారు.

కాగా ఎల్లుండి అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకలు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే ఆయన దేశంలోని పలు ఆలయాలను దర్శించుకుంటున్నారు. అందులో భాగంగా మహారాష్ట్ర నాసిక్ లోని రామ్ కుండ్ కాలా రామ్ దేవాలయం, ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షి వీరభద్ర ఆలయం, కేరళలోని గురువాయుర్ ఆలయం, త్రిప్రయార్ రామస్వామి దేవాలయాలను ప్రధాని ఇప్పటికే దర్శించుకున్నారు.

Tags:    

Similar News