బీఆర్ఎస్లో హరీశ్ రావుకు న్యాయం జరగదు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Byline :  Vijay Kumar
Update: 2023-12-20 09:09 GMT

మాజీ మంత్రి హరీశ్ రావుకు బీఆర్ఎస్ లో న్యాయం జరగదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. హరీశ్ రావును తండ్రీకొడుకులు వాడుకుంటున్నారని కేసీఆర్, కేటీఆర్ లను ఉద్దేశించి అన్నారు. తనకు మంత్రి పదవి రాదు అంటూ హరీశ్ రావు ఎలా మాట్లాడుతారని రాజగోపాల్ రెడ్డి నిలదీశారు. వాళ్ల పార్టీ గురించి, వాళ్లు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకోవాలని, తన పదవి గురించి ఆయనకు ఎందుకని అన్నారు. అబద్ధాలు చెప్పడంలో తన మేనమామ కేసీఆర్ నుంచి హరీశ్ రావు ట్రైనింగ్ చేశారని ఎద్దేవా చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలో వద్దో అనేది తమ పార్టీ ముఖ్య నేతలు, సీఎం రేవంత్ రెడ్డి చూసుకుంటారని అన్నారు. అనవసరమైన వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. కాగా ఐదు రోజుల కిందట జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో హరీశ్ రావు మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తాను ఎంత అరిచినా మంత్రి పదవి మాత్రం రాదు అంటూ రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి హరీశ్ రావు అన్నారు. 

Tags:    

Similar News