KCR : ఎరువులు పంపించు.. వ్యాపారికి కేసీఆర్ ఫోన్

Byline :  Vijay Kumar
Update: 2024-01-14 09:22 GMT

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు ఇటీవల తుంటి ఆపరేషన్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తన హైదరాబాద్ లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా తాజాగా ఓ ఎరువుల వ్యాపారికి కేసీఆర్ ఫోన్ చేశారు. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు, విత్తనాలు పంపాలని వంటిమామిడి ఎరువుల వ్యాపారితో కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు. యూరియా, డీఏపీ తదితర ఎరువులను మూడు రోజుల్లో పంపాలని ఆ వ్యాపారిని కేసీఆర్ కోరారు. ఎరువులకు సంబంధించిన గత బకాయి రూ.11 లక్షలను రేపు పంపిస్తాని, ఇప్పుడిచ్చే ఎరువుల డబ్బును రెండు మూడు రోజుల్లో పంపిస్తానని కేసీఆర్ అన్నారు. అందుకు ఆ వ్యాపారి సరేనన్నారు. ఇక ఆడియో చివరలో ఎరువుల వ్యాపారి ఆరోగ్యం ఎలా ఉందని కేసీఆర్ ను అడగగా.. బాగున్నానని, 15 రోజుల్లో ఫామ్ హౌజ్ కు వస్తానని కేసీఆర్ బదులిచ్చారు. కేసీఆర్ కు సంబంధించిన ఈ ఫోన్ కాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Full View




Tags:    

Similar News