మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఇంట్లో విషాదం

Update: 2024-01-19 15:40 GMT

మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త, మాజీ పీపుల్స్ వార్ నేత గాలన్న గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు కరీంనగర్లో లైఫ్ లైన్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన సైదాపూర్ మండలం వెంకటేశ్వర్ల పల్లెకు బంధువులు తరలించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనను కరీంనగర్ లోని లైఫ్ లైన్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ చేశారు. ఇక గాలన్న మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆయన మృతిపై సంతాపం తెలిపారు. బొడిగె గాలన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం నుంచి పని చేశారని, శంకరపట్నం జడ్పీటీసీగా, చొప్పదండి ఎమ్మెల్యేగా పనిచేసిన తన సతీమణి శోభక్కకు అండగా ఉండి పనిచేసారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. బొడిగె గాలన్న చిన్నతనం నుంచే పేదప్రజల సమస్యలపై పోరాటం చేశారని ఆయన తెలిపారు. వామపక్ష పార్టీలలో పని చేశారని, గాలన్న మృతి తీరని లోటన్నారు.




Tags:    

Similar News